Saturday, January 17, 2009

మా రి ష స్ మాయాజా లం

హిందూ మహా సముద్రంలో చిన్న ద్వీపం ఇటివల కాలంలో మన తెలుగు వార్తా పత్రికలలో ప్రముఖ స్థానం సంపాదించుకోవడం చాల ఆశ్చర్యకరం .ఇంతటి ప్రాచుర్యానికి గల కారణాన్ని పరిశీలిద్దాం .మన దేశం లోనికి వచ్చే విదేశి పెట్టుబడులలో సింహ భాగం ఈ దేశం నుండి వచ్చేవే .అన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన సామర్ధ్యం ఆ చిన్ని దేశానికీ ఎలా వచ్చిందని అశ్చర్య పోతున్నారా ?
అసలు తిరకాసు ఏమిటంటే విదేశి పెట్టుబడుదారులు తమ తమ దేశాలనుండి పెట్టుబడిని తీసుకుని వచ్చి తిరిగి వేరే దేశాలలో గాని లేక తమ సొంత దేశంలో ఇతర కంపెనీ ల లో గాని పెట్టు కోవడానికి అనుమతించడమే.పదిహేను లక్షల జనాభా కూడా లేని ఈ దేశం లో పదిహేను వందల కంపెనీ లు ఈ వ్యాపారం చేస్తున్నయంటే ఆశ్చర్యకరమే.మన రామలింగరాజు గారు కూడా సత్యం లో తన కుటుంబ వాటాలను ఇక్కడి తన కంపెనీ కి అమ్మి ఆ డబ్బును యావత్తూ ఈ దేశానికీ బదలాయించి మల్లి ఇక్కడి నుండి తన కుమారుల కంపెనీ'మయతస్' లో పెట్టుబడిగా భారత దేశానికీ పంపడం పచ్చి నిజం. జలయజ్ఞం లో ముడుపుల కధ కూడా ఇదేననడానికి ఆస్కారం ఉంది. భారత దేశం లోని నియంత్రణ వ్యవస్థ లను నీరు కార్చే ప్రయత్నాలను అడ్డుకొని వక్ర మార్గాలలో ఆర్జించే సంపదను అరికట్టడానికి ఉపయోగపడే చట్టాలను రూపొంది న నాడే మన దేశానికీ ప్రయోజనం కలుగుతుంది .

No comments: