Tuesday, January 6, 2009

వోట్లు కురిపించే నోట్లు

కృష్ణ జిల్లాలోని ఉంగుటూరు మండలంలో నందమూరు సెగ్మెంట్ మండల ప్రజా పరిషద్ ఉప ఎన్నిక ఈ నెల నాల్గవ తేదిన జరిగింది.
ఈ సెగ్మెంట్ లో మొత్తం వోటర్లు సుమారు 2000. వివిధ రాజకీయ పక్షాలు ఈ సెగ్మెంట్ ఎన్నికకు చేసిన ఖర్చును చూస్తె ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యమా నీ పయనం ఎటు అని ప్రశ్నించుకోవాలి .ఈ ఎన్నికలో దాదాపు ఒక కోటీ రూపాయలను మంచి నీళ్ళలా ఖర్చు పెట్టిన
ప్రతి రాజాకీయ పక్షం ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది .
పదిహేనురోజులపాటు జర్గిన ఈ ఉపఎన్నిక ప్రచారహోరు లో పారిన మద్యం ఇతర ఖర్చులు చూసిన ప్రతి ప్రజా స్వామ్యవాడి సిగ్గుతో తలదించకోవాలి .ఇతర సెగ్మెంట్లలో సభ్యులను ఉపఎన్నికల కోసం రాజీనామా చెయ్యమని వత్తిడి చేస్తున్న వొటర్లును చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థ్థి తి.ఎన్నికల తరువాత వ్యవసాయ కూలీలు దొరకక పోవడం ఈ పిచ్చి కి పరాకాష్ట.
ప్రతిష్ట కోసం ప్రజా స్వామ్మ్యాన్ని ఖూని చెయ్యవద్దని రాజకీయ పక్షాలను కోరుకోవడం మినహా మనం చేయ గలగినది మాత్రం ఏముంది .

No comments: