Sunday, January 4, 2009

మహిళా నిరక్షరాస్యత నిర్ములనతో నవ సమాజాన్ని నిర్మిద్దాం

౨౦౦౧ జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళా అక్షరాస్యతా ౫౪%.కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి మరి దారుణం
. బీహార్ రాజస్థాన్లలో ఇది ౧౮%.ఇదే పరిస్థితి కొనసాగితే సంపూర్ణ అక్షరాస్యతా సాధించడానికి మరో శతాబ్దం పట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు .మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ని పరిశీలిస్తే ఎంతో కలవరం కలుగకమానదు .నూటికి యాభై శాతం మహిళలు నిరక్షరాస్యులే .మరి మన నాయకులేమి చేస్తున్నారు .మహిళా సాధికారత అంటు ఉకదంపుడు ఉపన్యాసాలతో ౬౦ సంవత్సరాల కాలాన్నీ వృధా చేసారు .ఇంకా చేస్తున్నారు .దీనికి కారణాలు వెదుకుతూ సమయాన్ని వృధా చేయడంకంటే కార్యాచరణకు పూనుకోవడం విజ్ఞుల లక్షణం .కార్యాచరణ ఎలా వుండాలి .
రాష్ట్రంలో నిరక్షరాస్యులైన మహిళలును శాస్త్రీయ పద్దతులలో గుర్తించాలి .
వయోజన మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత .రాష్ట్రంలోని ప్రతి కళాశాల విద్యార్ధి కనీసం ౫ మంది మహిళా వయోజనులను అక్షరాస్యులుగా చేసే కార్యాచరణ పధకాన్ని అమలుచెయ్యాలి.
బాలికలందరికి సెకండరి విద్యను ఉచితంగా నిర్భందం గా అమలుచెయ్యాలి
బడి కి పంపడం తల్లి తండ్రుల బాధ్యత గా గుర్తిస్తూ అమలు చెయ్యని వారిని శిక్షించే హక్కును స్థానిక సంస్తలకిస్తూ శాసనం చెయ్యాలి
మహిళా సాధికారతకు తొలిమెట్టు మహిళా విద్యకు అధిక ప్రాముఖ్యం ఇవ్వడమేనని పాలకులు గుర్తించాలి

No comments: