Sunday, January 11, 2009

వంశ పారంపర్యం - ప్రజా స్వామ్యం

ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పరచ బడిన వ్యవస్థ గ నిర్వచించ బడిందని మనందరికీ తెలుసు .
కాని మన నాయకులకు మాత్రం అది వంశ పారంపర్యంగా అధికారాన్ని బదలాయించే ప్రక్రియగా కనబడితే మన మరియు మన దేశ భవిష్యత్తు ప్రమాదంలో పది నట్లే .దీనికి మూల కారాణాలను వెదకడం మన ప్రధమ కర్తవ్యం .
నా దృష్టిలో దీనికి మూల కారణం మానవ సహజమైన పుత్ర వా త్స్య లం అనిపిస్తుంది .ప్రతి తండ్రి తమ సంతానం తమ కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలనుకోవడం తప్పుకాదు . కానీ దాన్ని సాధదించడానికి తమ రాజకీయ అధికారాన్ని ,రాజకీయ పదవులతో సంపాదించిన ధన్నాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజా స్వామ్యానికి చేసే హాని అంతులేనిది .దీనిని చక్కదిద్దడానికి వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాలి .దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక పదవిలో రెండు సార్లు కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేకుండా ప్రజా ప్రాతి నిద్యా చట్టాన్ని సవరించాలి.అలాగే సంపదను వంశ పారం పర్యం గా అనుభవించడానికి వీలు లేకుండా సంతానానికి డెబ్భై శాతం మిగిలిన ముప్పై శాతం ప్రభుత్వ ని కి చెందేటట్లు వారసత్వ చట్టానికి సవరణ చెయ్యాలి .ప్రతి పౌరుడు వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలి .

1 comment:

gavi said...

Hello,
How practial is it to estimate the wealth of an individual after death in India? In the US, Estate tax is going to be re-instated soon, but here wealth of individuals is mostly known, although some people here also use offshore accounts to hide some money.

In India, most of the time the wealth is hidden.