స్వాతంత్రం వచ్చి ౬౦ వసంతాలు గడచిన తరువాత కూడా సంపూర్ణ అక్షరాస్యతా దూరపు కలగానే మిగిలిపోయింది .విద్య ప్రాధమిక హక్కుగా గుర్తింపు పొందలేకపోయింది .దీనికి కారణాలు ఏమైనప్పటికీ ౨౧ వ శతాబ్డంలోనైన దేశ పౌరులందరికీ ప్రాధమిక విద్య కల్పించడం ప్రభుత్వాల కనీస బాద్యత .దీనికి తగిన కార్యాచరణ కు నడుం బిగించాలి .
విద్యను ప్రాధమిక హక్కు గా గుర్తిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలి
విద్యను ఉమ్మడి జాబితాలో చేరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిని నిర్వచించాలి
జనాభాను దృష్టిలో ఉంచుకొని దేశాన్ని విద్యా జిల్లాలగా విభజించాలి
ప్రతి జిల్లాలో అన్ని ఆధునిక సదుపాయాలతో విద్యాలయలును నిర్మించాలి
విద్యాలయాలకు విద్యార్ధులను తీసుకురావడానికి ఉచిత రవాణా సదుపాయాన్ని కలుగచేయాలి
ఉన్నత పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్ధులందరికీ అందించాలి
జిల్లా లో ని విద్యాలయాలకు స్వయంప్రతిపత్తినిస్తూ ఆర్దికస్వయంపోషణకు పంచాయతి మరియు నగరపాలకసంస్తల
ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించాలి .
దేశంలో పుట్టే ప్రతి బిడ్డ పుట్టగానే సంబందిత విద్య జిల్లాలో నమోదు కావాలి
నమోదు అయిన ప్రతి బిడ్డను విద్యాలయాలలో చేర్పించడానికి విద్యా వాలంటీర్ల వ్యవస్థను నిర్మించాలి
విద్యాలయాలలో ఉన్నత ప్రమాణాలతో సిబ్బందిని నియమించాలి
రాష్ట్రలలోగల విద్యాలయాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికార మండలిని నియమించాలి
విద్యాలయాలకు పిల్లలలును పంపడం తల్లి తండ్రుల బాధ్యతగా ప్రచారం చేస్తూ అలా పంపని తల్లి తండ్రులకు జరిమానా విధించే అధికారం స్థానిక సంస్థలకు దాకలు చెయ్యాలి
విద్యాలయాలలో ప్రవేశానికి కులము మతము నమోదు చెయ్యడాన్ని నిషేదించాలి
ఈ ప్రమాణాలతో సంస్కరణలను అమలు చేస్తే ౫ వసంతాలలో నూతన భారతాన్ని నిర్మించుకోగలం
Saturday, January 3, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment