Thursday, January 8, 2009

'సత్యం వధ -లెక్కలచెర '

కంపెనీ లెక్కలను చెరలోపెట్టి "సత్యం"ను వధించిన ఓ రామలింగరాజ నీ మేధా సంపత్తి అనన్యసామన్యం .అమితమైన. నీ పుత్ర ప్రేమ
53000 మంది ఉద్యోగుల భవితను ఆంధ కారం లోనికి నెట్టిన వైనం29000వేల కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకులకు వచ్చిన వైనం 6800 ఎకరాల భూమి కేవలం నాలుగు సం వ త్స రాలలో సంపాదించిన వైనం తమ చరిత్రను చెప్పకనే చెప్పుతుంది .వాటాదారులను నట్టేట ముంచిన మీ చేష్టలను ,దేశ చట్టాలకు అనుగుణం గా శిక్ష అనుభ విస్తా నని చెప్పే మీ మాటలను మీకు సాయం చేసే మీ అధికార మిత్రులు నమ్మ వచ్చు నేమో గాని ఇతరులు ఎవ్వరు నమ్మరు . దేశ ప్రతిష్టను దిగ జార్చిన నీ నిర్వాకం స్టాక్ మార్కెట్
లోని మదుపు దారులందరికి ఒక గుణ పా టం .
దేశ కార్పొరేట్ రంగంలో ఇంక ఎంత మంది రామలింగరాజు లున్నరోనని భయ పడని వారుండరు .వీరి భయాన్ని పోగొట్టి ఆడిట్ అధికారాలను సమగ్రంగా నిర్వచించి మదుపు దారులలో విశ్వాసం నింపవలిసిన బాద్యత ప్రభుత్వానిది .

No comments: